హైదరాబాద్ : మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. గమనించదగ్గ విషయం ఏమంటే...ఈ షూటింగ్ మొత్తం రాత్రిపూటే జరుపుతున్నారట. నిన్న రాత్రి కొన్ని సీన్ల చిత్రీకరణ జరిగింది. ఈ రోజుతో పాటు ఓ వారం పాటు రాత్రిపూటే షూటింగ్ ఉంటుందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.ఇటీవల క్రితం మహేష్ బాబు కూడా తన ట్విట్టర్లో కూడా ఈ రాత్రి షూటింగ్ గురించి వివరించారు. ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నానని, రాబోయే 10 రోజులు నైట్ షూటింగ్ ఉందని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్తో కనిపించబోతున్నారు.ఈ విషయమై మహేష్ బాబు తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ....‘గడిచిన మూడు నెలలు చాలా కష్ట పడ్డాను. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ క్రిస్ గెతిన్ పర్యవేక్షణలో న్యూలుక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. నా కొత్త లుక్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అంటూ మహేష్ బాబు ట్విట్ చేసారు.ఈ చిత్రంలో క్రితి సానన్ హీరోయిన్ గా చేస్తోంది. మహేష్తో ‘దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈచిత్రానికి టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
No comments:
Post a Comment