హైదరాబాద్ : ఒక హీరోని అనుకుని తర్వాత మరో హీరో ఆ ప్లేస్ లోకి రావటం సినీ పరిశ్రమలో సర్వ సాధారణం. ఎవరికి హిట్టు రాసిపెట్టి ఉంటే వారు ముందుకు వచ్చి..మిగతా వారు వెనక్కి వెళతారు. అలాగే..ప్లాఫ్ సినిమాల విషయంలోనూ చివరి క్షణాల్లో హీరోల మార్పు వరంగా మారుతుందా హీరోలకి. అలా పూరి జగన్నాధ్ చేసిన మార్పు రవితేజ ప్లేస్ లోకి మహేష్ ని తీసుకు వచ్చింది. ఈ విషయమై 'ఈనాడు' దినపత్రిక ఓ కథనం రాసింది.... అదేమిటంటే...
మహేష్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం పోకిరి. పూరి జగన్నాథ్ తొలుత రవితేజతోనే ఈ కథను తెరకెక్కిద్దామనుకున్నారు. అప్పుడు ఈ సినిమా టైటిల్... 'ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ'. రవితేజ-పూరి ఇద్దరూ ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు.. పూరికి తట్టిన ఆలోచన ఇది.
అది కాస్తా 'పోకిరి'గామారి.. మహేష్బాబు చేతికి వెళ్లింది. మహేష్బాబు కెరీర్లో ఓ మరపురాని చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా అందాల్ని మర్చిపోలేం. అయితే అక్కడా మార్పు జరిగింది. మొదట ఆ పాత్ర కోసం ముందు పార్వతిమెల్టన్ని సంప్రదించారు.
'పోకిరి' మొదలయ్యే సమయానికి 'వెన్నెల' సినిమా రిలీజయ్యి.. పార్వతిని చూసి పూరీ అవకాసమిచ్చారు. పొడుగ్గా ఉంటుంది కాబట్టి మహేష్ పక్కన సరిగ్గా నప్పుతుంది అనుకొన్నారు. కానీ... చివరి నిమిషంలో ఇలియానా దగ్గరకి చేరిందా చిత్రం. 'పోకిరి' దక్కి ఉంటే... పార్వతి కెరీర్ ఎలా ఉండేదో మరి అని ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకుంటూంటారు.
No comments:
Post a Comment