Friday, May 3, 2013

హాట్ టాపిక్ :మళ్ళీ మహేష్ వాయిస్ ఓవర్

హైదరాబాద్ : మహేష్ బాబు మరో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి గొంతు సవరించుకుంటున్నారా....అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి పండించనున్నారని చెప్పుకుంటున్నారు. జల్సా చిత్రంతో వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ ..రీసెంట్ గా ఎన్టీఆర్ బాద్షా కు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిమిత్తం రైల్వే స్టేషన్ సెట్లో పవన్ కళ్యాణ్ ఆర్ ఎఫ్ సి లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిత్రంలో వచ్చే ఈ సీన్స్ చాలా కీలకమైనవి అని... పవన్ అభిమానులు విజిల్స్ వేసే రీతిలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

No comments:

Post a Comment